రుద్రంపూర్, ఫిబ్రవరి 18 : ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పోరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన జయంతి మసుద్ (54వ డివిజన్), మహమ్మద్ షాహిర (57వ డివిజన్), మహమ్మద్ దావూద్ (58 వ డివిజన్) లను అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్షుడు షేక్ కరీం ఖాద్రీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ప్రజల ఆకాంక్షల మేరకు గెలుపొందిన కార్పోరేటర్లు పని చేయలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, షేక్ యఖుబ్ ఖాద్రీ, ప్రథాన కార్యదర్శి మహమ్మద్ హుస్సైన్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ షమీ, షఫీ, మహబూబ్ ఖాద్రీ, సయ్యద్ అన్సార్, పట్టణ ఉపాధ్యక్షడు ఈషా పాల్గొన్నారు.