– ఐకేఈ ఏపీఎం బండి వినోద్ క్రాంతి
– పెరటికోళ్ల పెంపకానికి బ్యాంక్ ద్వారా ఆర్థిక చేయూత
– మహిళా సమాఖ్య సభ్యులకు రూ.5.50 లక్షల చెక్కు అందజేత
కరకగూడెం, మే 29 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యలలోని 275 మంది సభ్యులకు రూ.5.50 లక్షలు పెరటి కోళ్ల పెంపకం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంభందించిన చెక్కును శుక్రవారం మండల కేంద్రంలోని టీజీబీ బ్యాంక్ కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్ ఎన్.గిరిబాబు, ఐకేపీ ఏపీఎం బండి వినోద్ క్రాంతి గ్రూప్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎపీఎం వినోద్ క్రాంతి మాట్లాడుతూ.. పెరటికోళ్ల పెంపకంతో మహిళలు దినదిన అభివృద్ధి చెందుతూ ఆర్ధికంగా కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీలు పోలెబోయిన విజయలక్ష్మీ, సత్యనారాయణ, అకౌంటెంట్ ప్రీతి, సమాఖ్య ప్రతినిధి మహేశ్వరి పాల్గొన్నారు.