రుద్రంపూర్, మార్చి 07 : మానవ మనుగడకు మూలాధారం, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీలను సమస్థానంతో గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక స్త్రీ తల్లిగా జన్మనిస్తుంది. తన సుఖసంతోషాలు త్యాగం చేసి కుటుంబ బాగోగులు చూస్తుంది. అక్కా, చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా ఇంటి బాగోగులు చూస్తూ, కూతురిగా ఆనందాలు పంచే మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణింగలమని నేడు స్త్రీలు నిరుపిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి లో స్త్రీలకు అత్యుత్తమ స్థానం ప్రస్తావించబడిందన్నారు. కాగా నేటి ఆధునిక యుగంలో కూడా స్త్రీలు ఇంకా వివక్షకు గురవుతున్నారంటే అది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పర్వీన్ సుల్తానా, లక్ష్మీ ప్రసన్న, సరస్వతి, నుసరత్, జేఫీషా, విజయలక్ష్మి, శిరీషా, నీల, సల్మా, నాజీయ సుల్తానా, సుహాన, ఖాజా పాల్గొన్నారు.

‘స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు’