చండ్రుగొండ: నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని మెడికల్ ఆఫీసర్ రాకేష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని, పాఠశాలల్లో చదివే విద్యార్దులకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత ఉపాద్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అన్నపూర్ణ, ఎంఈఓ సత్యన్నారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.