– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
బూర్గంపహాడ్, సెప్టెంబరు 01 : బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలన, హామీలు అమలు చేయని 420 మోసాలపై బుధవారం మణుగూరులో బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మంగళవారం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనకు సంబంధించి మణుగూరులో ఉదయం 9 గంటలకు ధర్నా, బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు, మహిళా, యువజన నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.