కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్శించి పూల మాల వేశారు. ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ ఆయన మృతి యూనియన్కు తీరని లోటని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఆయన వెంట ఎంఏ రజాక్, కాసుల వెంకట్, కో-ఆప్షన్ మెంబర్ యాకూబ్,యూసుఫ్, టీబీజీకేఎస్ నాయకుడు ఎండీ రజాక్, నాగేశ్వరరావు, శేఖర్, అశోక్, ఎండీ గౌస్, చిలక రాజయ్య, జానీ, బాలప్రసాద్ పాసి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.