కొత్తగూడెం: ఇటీవల హైదరాబాద్లో వెన్నుముఖ సర్జరీ చేయించుకొని హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విశ్రాంతి తీసుకుంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మంగళవారం టిఆర్ ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆరోగ్య పరిస్థితిని,అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో లక్ష్మీదేవిపల్లి మండల కో-ఆప్షన్ మెంబర్ జక్కుల సుందర్, కొత్తగూడెం డివిజన్ ఆత్మకమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్లు ఉన్నారు.