దమ్మపేట: ఎంపీ నామాను టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఖమ్మంలోని ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసంలో దమ్మపేటకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నెం అప్పారావు, యూత్ నాయకులు కిషోర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మండలంలో ఉన్న సమస్యలను ఎంపీ నామా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన నామా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.