దమ్మపేట: అశ్వారావుపేట నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మంగళవారం డిజిటల్ తరగతులపై దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా దమ్మపేట ఎంఈవో కీసరి లక్ష్మి హాజరై ఉపాధ్యాయులకు డిజిటల్ తరగతులపై అవగాహన కల్పించారు. తరగతి గదిలో విద్యార్థులకు డిజిటల్ క్లాసులను అర్ధవంతంగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మస్తాన్ అలీ, రిసోర్స్ పర్సన్ సూర్య, మూడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.