సుజాతనగర్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి కాలు తెగిపడిన ఘటన భద్రాత్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత నిమ్మలగూడెం గ్రామానికి చెందిన రాజేష్ తన ద్విచక్రవాహనంపై శనివారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తగూడెం నుంచి తన స్వగృహానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేపలగడ్డ గ్రామం గురుకుల పాఠశాల వద్దకు రాగానే ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న గుర్రం ప్రవీణ్ అతి వేగంగా వస్తూ రాజేష్ ను బలంగా ఢీ కొట్టాడు.
ఈ ఘటనలో రాజేష్ కాలు తెగి పొలంలో పడింది. ప్రమాదానికి కారణమైన ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.