దమ్మపేట: ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన తాతా మధు గెలుపు పట్ల దమ్మపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ వద్ద తాతా మధు విజయం సాధించడంతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, దమ్మపేట ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, పార్టీ కార్యదర్శి దొడ్డా రమేష్లు రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి ఆనందాన్ని పంచుకుని విజయోత్సాహంలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట స్థానిక నాయకులు పాల్గొన్నారు.