అన్నపురెడ్డిపల్లి :మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా పవిత్రోత్సవాల వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయంలో పురోహితులు గిరిధరాచార్యులు ఆధ్వర్యంలో హవనం, బలిహరణం, కుంకుమ పూజలు నిర్వహించారు. 15న విజయ దశమి సందర్భంగా మహా పూర్ణాహుతి 11గంటలకు శ్రీస్వామివారి కల్యాణ మహోత్సవం, సాయంత్రం శమీ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా తెలిపారు.