సారపాక: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి విద్యార్ధి అమరుడు శ్రీకాంతచారి సేవలు అనిర్వచనీయమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ తొలి విద్యార్ధి శ్రీకాంతచారి 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకులు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని జై..తెలంగాణ నినాదాలు చేసిన మహనీయుడు శ్రీకాంతచారి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెండే చంద్రశేఖర్, కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, ఉద్యమకారుడు దాసరి సాంబ, మండల నాయకులు శ్రీనివాస్గౌడ్, రాజు, పోతోజు కొండయ్య, బొద్దు ఉమామహేశ్వరరావు, కాసర్ల వీరభద్రాచారి, తిరుమలగిరి నర్సింహాచారి, పుల్లాచారి, పోతోజు శ్రీనివాసరావు, ఉపేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.