– ఎన్కే నగర్ సర్పంచ్ శ్రీకాంత్
చుంచుపల్లి, జూన్ 04 : చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ పారిశుధ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇందిరా, ఉప సర్పంచ్ లక్ష్మి, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.