భద్రాచలం: సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని లక్ష్మి తాయారమ్మ వారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.
లక్ష్మి తాయారమ్మ వారి సన్నిధిలో అర్చకులు వారికి వేదాశ్వీరచనం తోపాటు, రామయ్య జ్ఞాపికను, ప్రసాదాలను, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్మితా సభర్వాల్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్, డీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.