దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాలు, మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కల్యాణాన్నితిలకించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు, పులిహోర ప్యాకెట్లను అందజేశారు.