భద్రాచలం: పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుడు కే శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు సమాచారమిచ్చారు. ఆయన స్పందించి వైద్యారోగ్యశాఖాధికారులకు తెలపడంతో వారు మంగళవారం పాఠశాలలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు చేశారు.
కాగా అందరికీ నెగిటివ్గా నిర్ధారణ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, ఎంఈఓ సున్నం సమ్మయ్య, హెచ్ఈఓ కృష్ణయ్య, ఏఎన్ఎం భద్రమ్మ, ఆశ కార్యకర్తలు, 104 సిబ్బంది, ఎస్ఎంసీ ఛైర్మన్ కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.