ములకలపల్లి :రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని రైతువేదిక ఆవరణతో పాటు లోపల రంగవల్లులను తీర్చిదిద్దారు. రైతువేదికలను అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం రైతుబంధు సంబరాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2018 నుంచి 2021 వరకు తెలంగాణ ప్రభుత్వం మండలంలో 7,253 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ.182.67కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏవో కరుణామయి, ఎంపీపీ మట్ల నాగమణి, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, స్థానిక సర్పంచ్లు వాడె నాగరాజు, గడ్డం భవానీ, బీబినేని భద్రంతో పాటు ఏఈవోలు పాల్గొన్నారు.