భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. ఖమ్మానికి చెందిన సాగి శ్రీరామశాస్త్రి రూ. 1లక్ష వితరణగా అందజేశారు. ఉదయం రామయ్యను దర్శించుకున్న అనంతరం దేవస్థానం ఈఓ శివాజీకి అన్నదానానికి తనవంతుగా రూ. 1లక్ష చెక్కును అందజేశారు.