కొత్తగూడెం: అల్లాదయతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సఫాయిబస్తీ దర్గాలో జరిగిన గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ముస్లింలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు, కాసుల వెంకట్, మసూద్, రావి రాంబాబు, 22వ వార్డు యాకూబ్, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, బాలిశెట్టి సత్యభామ, కూరపాటి విజయలక్ష్మీ, గుమ్మడవల్లి కల్యాణి, వనచర్ల విమల, అజ్మీరా సుజాత, కో ఆప్షన్ సభ్యులు దుంపల అనురాధ, నాయకులు కేకే శ్రీను, వాసు, మాదా శ్రీరాములు, వనమా రాము, పూర్ణ, తొగరు రాజశేఖర్, హబీబ్, దర్గా కమిటీ సభ్యులు, ముస్లీంలు పాల్గొన్నారు.