పాల్వంచ : కళాకారుడిగా పుట్టడం దేవుడిచ్చిన గొప్ప వరమని, అది అందరికీ సాధ్యం కాదని కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిదని, గజ్జకట్టి, గళం విప్పి తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటి చెప్పిన ఘనత కళాకారులదేనని చెప్పారు. మంగళవారం పాల్వంచలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలో తెలంగాణ కళాకారుల జేఏసీ చైర్మన్గా జానకీరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్, బీజేఏసీ చైర్మన్ గుండపనేని సతీష్, దివ్యాంగ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మాలోత్ జగ్గుదాస్, అబ్దుల్ నయిం, కాటి నాగేశ్వరరావు, కత్తి శ్రీను, బీమా మాధవి, బీరా జయమ్మ, శ్రీనివాసరావు, ఎస్కే మున్నా, సీహెచ్ గోవర్ధన్, ఎస్కే ఖాసీం, చింతల కనకయ్య, లక్ష్మీనారాయణ నాయుడు, కనకయ్య, బిక్షం దాస్, కుమార్లు పాల్గొన్నారు.