పాల్వంచ : పాల్వంచలోని వికలాంగుల కాలనీకి చెందిన చిన్నారి శనగ అంజలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వికలాంగుల కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఇటీవల సంభవించిన వరద బీభత్సంలో ఏడేళ్ల చిన్నారి అంజలి మృతి చెందడం బాధాకరమని అన్నారు. చిన్నారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని డబుల్బెడ్రూం కేటాయించేలా తహసీల్దార్ని ఆదేశించారు. వారి పిల్లలకు ఉచితంగా చదివిస్తామన్నారు.
అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావును ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా సీఎం సహాయ నిధికి సిఫార్సు చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, తహసీల్దార్ స్వామి, మున్సిపల్ డీఈ మురళి, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, ఆత్మకమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాష్, టీఆర్ఎస్ నాయకులు కాల్వ భాస్కర్రావు, దాసరి నాగేశ్వరరావు, కనగాల బాలకృష్ణ, బండి చిన్న వెంకటేశ్వర్లు, బేతంశెట్టి విజయ్, చింతా నాగరాజు, కందుకూరి రాము, దారా చిరంజీవి, మోతె శేఖర్, బండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.