మణుగూరు: నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో మణుగూరుకు చెందిన బోధిధర్మ కరాటే అకాడమి విద్యార్థులు సత్తాచాటారని కరాటే మాస్టర్ రవి తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో మణుగూరుకు చెందిన వైష్ణవి రత్న కట విభాగంలో మొదటిస్థానం, ఫైటింగ్ విభాగంలో రెండోస్థానంలో నిలవగా, పగిడేరుకు చెందిన కొర నవదీప్ బ్లాక్బెల్ట్లో కట విభాగంలో గోల్డ్మెడల్, ఫైటింగ్లో సిల్వర్ సాధించారన్నారు. సున్నం మధులత కట విభాగంలో రెండోస్థానం సాధించగా, వీరికి ఇండియా కరాటే షుటోకాన్ సెక్రటరీ ఎండీ అబూ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందించారు.