బూర్గంపహాడ్, జూన్ 29 : జూలై 12న భద్రాచలంలో మాలల హక్కులు, సమస్యల సాధన కోసం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే మాలల మహా ర్యాలీని విజయవతం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మల కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో మాలల మహా ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. మాలల మహానాడు ర్యాలీలో జిల్లా నేతలు పాల్గొంటారని, మాలల బలం చాటుదాం.. మాల గళం విప్పుదాం.. మాలలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నినదించేలా ఈ మహా ర్యాలీ ఉంటుందని తెలిపారు. ప్రతి మాల బిడ్డ ఈ మహా ర్యాలీకి తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి దామాల సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్రాజ్, కార్యదర్శి బుయ్యని వీరబాబు, సాయికుమార్, కొట్టే అనిల్, బర్ల రామకృష్ణ, కొట్టే రాజు, బిల్లా, చిట్టిబాబు పాల్గొన్నారు.