దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సంఘంలో 876 మందికి రుణమాఫీ వర్తించిందని, ఈ నగదును ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు.
సహకార సంఘం పరిధిలోని ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు బొల్లి వెంకట్రావు, కలువ పూర్ణయ్య, సీఈవో ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.