చండ్రుగొండ:బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహరం అందించాలని మహిళా, శిశుసంక్షేమ అధికారి ఆర్. వరలక్ష్మీ.. అన్నారు. గురువారం వంకనంబర్, గానుగపాడు,బెండాలపాడు గ్రామాల్లో నిర్మాణంలోఉన్న అంగన్వాడి కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. చిన్నారుల బరువులను తూకం వేయించారు. ఈ సందర్బంగా ఆమె అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పలు ఆదేశాలు జారీ చేశారు. బరువు తక్కువుగా ఉన్నవారిని గుర్తించి , పేర్లు నమోదు చేసుకోవాలని, వారికి ప్రత్యేకంగా మెనూ ఇవ్వాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు గ్రామాల్లో పౌష్టికాహర కేంద్రాలుగా ఉండాలని, బాలింతలు, గర్బీణీలకు సమతుల్య ఆహారం అందించాలన్నారు. రక్తహీనత గర్బీణీలను గుర్తించి వారు సరైన ఆహార నియమాలు పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మలాజ్యోతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శంకుతల, అంగనవాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.