చుంచుపల్లి, మే 18 : చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామాల దగ్గరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుందని పేర్కొంటూ రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరన్న, సీపీఐ పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, ఏవో రాజేశ్వరి, సొసైటీ సీఈఓ రమణారెడ్డి, సొసైటీ సిబ్బంది, రైతులు శ్రీహరి, రాములు, వెంకటేశ్వర్లు, జగన్, బద్రు, వేణు పాల్గొన్నారు.