రామవరం, మార్చి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో వేంకటేశ్వర కాలనీలో ముస్లిం స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తూ చుంచుపల్లి తాసీల్దార్ 2022లో పంపిన నివేదికను ఆమోదిస్తూ వెంటనే ఆదేశాలు జారీ చెయ్యాలని జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ను కోరారు. చుంచుపల్లి మండల పరిధిలో ముస్లింల స్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలని 2022 ఫిబ్రవరిలో ప్రజావాణిలో నాడు కలెక్టర్ ను కోరగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తాసీల్దార్కు చెప్పారు.
దాంతో సర్వే నేం. 137/1లో గల ప్రభుత్వ భుమి నుంచి 1 ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ, ఆమోదం కోసం నక్షతోపాటు ఆర్డీఓ ద్వారా 30-9-2022 నివేదినకు కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. మూడు సంవత్సరాలు గడిచినా నేటి వరకు అనుమతి ఇవ్వలేదని, ఇట్టి విషయాన్ని గత నవంబర్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. కావున వెంటనే చుంచుపల్లి మండలంలోని వేంకటేశ్వర కాలనీలో ముస్లిం ఖబరస్థాన్ స్థలానికి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.