మణుగూరు: కార్మిక సంక్షేమం కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న టీబీజీకేఎస్పై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు అన్నారు. గురువారం మణుగూరు ఓసీలో జరిగిన గేట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులను నల్లబ్యాడ్జీలతో సమ్మె చేపించడంతోనే పబ్బం గడుపుకుంటున్నాయి తప్ప కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో చరిత్రలో నిలిచిపోయే సంక్షేమాన్ని సాధించామని తెలిపారు.
జాతీయ సంఘాల పేరుతో జేబీసీసీఐలో చలామణీ అవుతూ కార్మిక సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండాల్సిన సంఘాలే తప్పుడు ఒప్పందాలు చేస్తూ సింగరేణి కార్మికులకు గుదిబండలా మారాయన్నారు. ఫిట్ సెక్రటరీ ఇంతియాజ్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు అబ్దుల్ రవూఫ్, వీరభద్రయ్య, కోటా శ్రీనివాసరావు, కాపాశివాజీ, సాగర్, నాగెల్లి, రెడ్డిబాబు, వెంకటేశ్, రాజేశ్ తదితరులు ఉన్నారు.