బూర్గంపహాడ్, ఆగస్టు 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తేజావత్ సీతారాములు, విజయ దంపతులు తన కుమారుడు తేజావత్ చైతన్యతేజ జ్ఞాపకార్ధం గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. తేజావత్ చైతన్యతేజ గోదావరి ఖనిలో సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మూడేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన జ్ఞాపకార్ధం జయంతి సందర్భంగా పాఠశాలలో ఈ అన్నదానం నిర్వహించారు. అయితే ఆయన కుమారుడి జ్ఞాపకార్ధం తన మిత్రబృందం సహాయంతో ఇప్పటికే పాఠశాలలో రూ.2.50లక్షతో కళావేదికను సైతం నిర్మించి ఇచ్చామని, ప్రతి ఏడాది జయంతి సందర్భంగా పాఠశాలలో అన్నదానం నిర్వహించి కేక్ కట్ చేయడం ఆనవాయితీగా వస్తుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కిషన్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.