– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, జూలై 14 : సర్ కార్యక్రమంపై బీఎల్ఏలతో పాటు బీఆర్ఎస్ నాయకులు సైతం పని చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 24తో సర్ ప్రక్రియ ముగియనుండడంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికి ఫార్మ్స్ అందాయా.. లేదా, అందకపోతే సంబంధిత అధికారితో మాట్లాడి ఫార్మ్స్ అందేలా చూడాలన్నారు. ఫార్మ్స్ అందిన వారు తప్పులు లేకుండా నింపారా.. లేదా, ఒకవేళ నింపకపోతే వారికి సహాయం చేయాలన్నారు. నింపిన ఫార్మ్స్ను జాగ్రత్తగా ఆన్లైన్ చేశారా లేదా అని ఆరా తీయ్యాలన్నారు. మండల మాజీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు వ్యక్తిగత బాధ్యతగా భావించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరుకు అన్యాయం జరగకుండా చూడాలని, ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి నెలకొంటే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం మనందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.