చుంచుపల్లి : మండలంలోని రాంపురం పంచాయతీలో హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రామకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూధన్రాజులు గురువారం తనిఖీ చేరశారు. పనులను పర్యవేక్షించి పనులపై కొన్ని సూచనలు చేశారు.
మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సకినాల రమేష్, ఎంపీవో గుంటి సత్యనారాయణ, సర్పంచ్ పద్దం వెంకటమ్మ, ఉప సర్పంచ్ మోతపోతుల శివ, పంచాయతీ కార్యదర్శి వసంత, ఈజీఎస్ ఈసీ పిల్లి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.