చండ్రుగొండ: అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, వీటిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ప్రియాంక అన్నారు. బుధవారం సీతాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..జ్వరం వస్తే డెంగ్యూ జ్వరం అని భయపడాల్సిన పనిలేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టు ద్వారా మాత్రమే డెంగ్యూ జ్వరాన్ని నిర్దారించే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కీసరి శాంతమ్మ, జిపి సెక్రటరీ బాబులాల్, వైద్య సిబ్బంది క్రిష్ణయ్య, శారారాణి, టి.సుశీల, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.