భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుకున్న అనంతరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో ఈఓ బానోత్ శివాజీకి రూ. 50,001లు విరాళంగా అందజేశారు.