భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఏపీలోని విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన పేరిచర్ల రూపవతి, జానకి రామరాజు దంపతులు వితరణ అందించారు. రూ. 2,02,232లు విరాళంగా ఆలయ సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్కు అందజేశారు. రామయ్యను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అందించే అన్నదానానికి తమవంతుగా ఆర్థికసాయం అందించడం పట్ల దాతలు సంతోష వ్యక్తం చేశారు.