చుంచుపల్లి, ఆగస్టు 08 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి కాలినడకన బయల్దేరిన రామ భక్తులకు చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా మందిరంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పల్లెపాడు గ్రామానికి చెందిన సుమారు 40 మంది మహిళా భక్తులు భద్రాచలం పాదయాత్రగా వెళ్తుండగా, వారికి విద్యానగర్ కాలనీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించారు. వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్కే నగర్ ఉప సర్పంచ్ మహేష్ పాల్గొన్నారు.