భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా శనివారం కణ్డన్, ఆండాళ్ అమ్మవారిని బేడా మండపంలో వేంచేపు చేసి తిరుప్పావై పాశురాలను పఠించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి తాతగుడి సెంటర్ వరకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరువీధి సేవ నిర్వహించారు.