ఇల్లందు, ఏప్రిల్ 10 : పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ కన్వీనర్ తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. ప్రపంచ దేశాలలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దగ్గర గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విపరీతంగా ధరలు పెంచుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని, మరో వైపు ప్రత్యక్ష, పరోక్ష పన్నులులు అసాధారణంగా పెంచుకుంటూ పోతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామ నాగరాజు, సత్యనారాయణ కోరి, పవన్ పాసి, వెంకన్న, కోటేశ్వరరావు, గోల్కొండ బాలకృష్ణ, కాంత, ప్రసాద్ రాజు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.