పాల్వంచ, నవంబర్ 19 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం చేయడం లేదని ఆరోపిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు పాల్వంచ మండలంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, కాలేరు సింధు తపస్వి ఆధ్వర్యంలో పాల్వంచ ఎంపీడీఓని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల్లో రోడ్లు మొత్తం గుంతలమయంగా మారాయని, డ్రైనేజీలు అన్ని మురుగునీరు, చెత్తా, చెదారంతో పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, తక్షణమే వాటన్నింటిని మరమ్మతులు చేయాలన్నారు.
అలాగే పాల్వంచ మండలంలో కొత్త రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), తోట లోహిత్ సాయి, కాలేరు అఖిల్ మహర్షి, తోట ప్రవీణ్, పోసారపు అరుణ్ కుమార్, మహమ్మద్ ఆదిల్, కుమ్మరి కుంట్ల వినోద్, గిద్దలూరి శివ సాయి, కూరెల్లి మురళీమోహన్, దాసరి సురేశ్, నడిగట్ల రంజిత్, ఎస్ కె. రియాజ్, వరపర్ల జీవన్, అనిల్, ఫరీద్, షారుక్, మున్నా, హసీబ్, షరీఫ్, సాయి పాల్గొన్నారు.