కొత్తగూడెం సింగరేణి/ రామవరం, మార్చి 29 : రెండో రోజు మంగళవారం కూడా అదే దూకుడుతో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సంస్థ వ్యాప్తంగా మొదటి షిప్టులో 28,084 మంది కార్మికులకు గాను కేవలం 6907 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వీరిలో సెలవుల్లో 507 మంది ఉండగా, సమ్మెలో 20,670 మంది కార్మికులు పాల్గొన్నారు. హాజరుశాతాన్ని చూసుకుంటే 24.59 శాతం మాత్రమే హాజరయ్యారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మొదటి షిప్టులో హాజరైన కార్మికులు, ఉద్యోగుల వివరాలిలా ఉన్నాయి…
బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 821 మంది కార్మికులకు 198మంది, మందమర్రి ఏరియాలో 3,485మందికి 522 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 5,817 మందికి 717 మంది, కొత్తగూడెం కార్పొరేట్ / హైదరాబాద్లో మొత్తం 1,113 మందికి గాను 799 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,032 మందికి 620మంది విధులకు హాజరయ్యారు. ఇల్లెందు ఏరియాలో 573 మందికి 245మంది, ఏరియాలో 1,993 మందికి 855మంది, ఆర్జీ1 ఏరియాలో 3,565 మందికి 811మంది హాజరయ్యారు. ఆర్జీ2 ఏరియాలో 2,567 మందికి 530మంది, ఆర్జీ3/ అడ్రియాలా ప్రాజెక్టులో 2,740 మందికి 908మంది, భూపాలపల్లిలో 3,316 మందికి 673మంది, ఎస్టీపీపీలో 55 మందికి 46మంది హాజరుకాగా మొత్తం 28,084 మందికి కేవలం 6,907మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్లు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రలో మానవహారం చేశారు. కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు సోమిరెడ్డి, చిన్ని, ఇఫ్టూతోపాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జీకేవోసీ, జేవీఆర్వోసీ2, కిష్టారం ఓసీ, వీకే 7 ఇైంక్లెన్, పీవీకే 5 ఇైంక్లెన్, సివిల్ కార్యాలయం, ఆర్సీహెచ్పీ, జీఎం కార్యాలయం, ఏరియా వర్క్షాప్, ఎస్అండ్పీసీ విభాగాల్లో ప్రీ షిప్టు, మొదటి షిప్టు, రెండో షిప్టులలో 2,432మందికి గాను 704 మంది మాత్రమే హాజరైనట్లు, 1,728మంది సమ్మె కారణంగా విధులకు హాజరుకాలేదు. దీంతో ఏరియాలో రోజువారీ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.