విజయాన్ని కేసీఆర్కు కానుకగా ఇద్దాం
ఎన్నికల ప్రచారంలో మంత్రి పువ్వాడ అజయ్
పలు డివిజన్లలో ఎంపీ నామా, మాజీ మంత్రి తుమ్మల పర్యటన
ప్రచారంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులురఘునాథపాలెం, ఏప్రిల్ 25 : కార్పొరేషన్ ఎన్నికల్లో 60కి 60 స్థానాలు గెలుస్తామని మంత్రి అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠాన్ని సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. ఆదివారం నగరంలోని 2, 3, 4 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. హైదారబాద్కు దీటుగా ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్గా ఏర్పడిన తరువాత నగరంలో రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని అందించాలన్నారు. 3వ డివిజన్ పర్యటనలో అభ్యర్థి కొణకంచి వరప్రసాద్కు ఓటు వేసి బల్లేపల్లి అభివృద్ధికి తోడ్పాడాలన్నారు. 2వ డివిజన్ అభ్యర్థి నర్రా ఎల్లయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను గెలిపిస్తే ఎలాంటి లాభం ఉండదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే ప్రగతికి చోటు ఉంటుందన్నారు. ప్రచారంలో మాజీ మేయర్ గుగులోతు పాపాలాల్, 2 ,3, 4 డివిజన్ల అభ్యర్ధులు నర్రా ఎల్లయ్య, కొణకంచి వరప్రసాద్, దండా జ్యోతిరెడ్డి, ఎన్నికల ఇంచార్జ్లు కుర్రా భాస్కర్రావు, మద్దినేని వెంకటరమణ, షేక్ అఫ్జల్ హసన్, మందడపు సుధాకర్, నాయకులు కుర్రా మాధవరావు, యెచ్చు ప్రసాద్, ఫయాజ్, చిలుమూరు కోటి, మేడెబోయిన ఉపేందర్, భద్రయ్య, కొట్నాల ఉపేంద్రాచారి, షేక్ రజీం, కొట్టే సంజీవరావు, నాగేంద్రబాబు, కెచ్చిలి రాజు, కాట్రాల శ్రీరాములు, పురం వెంకన్న, బండి సత్యం, బండి సత్యనారాయణ, వర్దెబోయిన గురవయ్య, రోషయ్య, దాసరి లక్ష్మీనారాయణ, అనీల్, మంద రాము, దాసరి ప్రసాద్, వంటికొమ్ము శ్రీనివాస్రెడ్డి, జోగుపర్తి ప్రభాకర్, కోడిరెక్క ఫ్రాన్సిస్, ఎడెల్లి భిక్షం, షేక్ వలీ, తంగెళ్లపల్లి శ్రీనివాసరావు, తీగల సతీశ్ పాల్గొన్నారు.