కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 24: మావోయిస్టు పార్టీకి చెందిన 5వ కంపెనీ 2వ ప్లాటూన్ ఏ-సెక్షన్ డిప్యూటీ కమాండర్ సోడి దేవాను చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సునీల్ దత్ శనివారం కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు… చర్ల మండలంలోని గీసరెల్లి సమీప అటవీ ప్రాంతంలో అక్కడి పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు తన వివరాలు తెలిపాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడ్డలిగూడ గ్రామానికి చెందిన అతడి పేరు సోడి దేవా. 2011వ సంవత్సరం నుంచి మావోయిస్టు పార్టీలో సుక్మా, కాంకేర్ జిలాల్లో పనిచేశా డు. ప్రస్తుతం ఆ పార్టీ 5వ కంపెనీ 2వ ప్లాటూన్ ఏ-సెక్షన్ డిప్యూటీ క మాండర్గా పనిచేస్తున్నాడు. 2015లో కాంకేర్ జిల్లా కోలిబేడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పులు, అదే సంవత్సరం కాంకేర్ జిల్లా పఖంజూర్ ఏరియా లో బీజేపీ నాయకుడిపై హత్యాయత్నం, 2016లో రావుఘాట్ ఏరియా కేసికోడి గ్రామం వద్ద పోలీసులపై కాల్పులు, 2018లో కొండగావ్ జిల్లా ఇర్పనార్ వద్ద పోలీసుల హత్య, 2020లో పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందా గ్రామ సమీపంలో కాల్పులు, 2020 అక్టోబర్లో కోసురొండ సమీపంలో ఎస్ఎస్బీ క్యాంపులోని బలగాలపై కాల్పుల ఘటనల్లో సోడి దేవా పాల్గొన్నాడు. ఇతడి నుంచి ఐదు డిటోనేటర్లు, 20 జిలిటెన్ స్టిక్స్, 200 మీటర్ల కార్డెక్స్ వైర్లను పోలీసులు స్వాధీనపర్చుకుని, కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.