భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు ఆన్లైన్లో ఉంచనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. జనవరి 3నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 12న తెప్పోత్సవం,13న ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వారంలో సీతారామ, లక్ష్మణులను చూసి తరించేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.
జనవరి13న జరిగే ఉత్తర ద్వార దర్శనం రోజున హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ముందస్తుగా టిక్కెట్లు పొందేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించారు. టిక్కెట్లు ధర రూ. 2వేలు, రూ. 1వేయి, రూ. 500లు, రూ. 250లుగా నిర్ణయించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకోవడానికి దేవస్థానం వెబ్సైట్ www.bhadrachalamonline.com ద్వారా టిక్కెట్లను పొందవచ్చు.