దుమ్ముగూడెం : మండలంలో శనివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించిన బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ రవికుమార్ శుక్రవారం తెలిపారు. మండలంలో 17,422 మంది లబ్దిదారులు ఉండగా 14,112 లబ్దిదారులకు బతుకమ్మ చీరెలు వచ్చాయని, 24 చౌకదుకాణాల ద్వారా డీలర్లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల చేతులు మీదుగా శనివారం నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే చౌకదుకాణాల డీలర్లకు బతుకమ్మ చీరెలను అందించడం జరిగిందని పేర్కొన్నారు.