దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు యాగంటి అరుణ్కుమార్ వచ్చేనెల నేపాల్లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. క్రీడాకారుడు అరుణ్కుమార్ను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తాటి సుబ్బన్నగూడెంలోని తన నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. నేపాల్కు వెళ్లేందుకు అవసరమైన ఆర్ధికసాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్లో రాణించడం అభినందనీయమని, అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించి పుట్టిన ఊరికి, కన్నవారికి మంచిపేరు తేవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట నాయకులు ఎల్లిన రాఘవరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, రాయల నాగేశ్వరరావు, ఎర్రగొర్ల రాధాకృష్ణ, స్థానిక నాయకులు ఉన్నారు.