రుద్రంపూర్, జూలై 13 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని యూపీహెచ్సీ రామవరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులి పురుగుల నివారణ ప్రాధాన్యతను వివరించి ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. మాత్రలు తీసుకోని విద్యార్థులందరికీ ఈ నెల 20వ తేదీన నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ (చిట్టిరామవరం), కార్పొరేటర్లు కంచర్ల హిమశ్రీ, మునిగడప పద్మ, ప్రిన్సిపాల్స్ ఎ.విజయ, ఎ.సరిత, జీహెచ్ఎస్ నాగయ్యగడ్డ హెచ్ఎం భరత్ కుమార్, అరుణ కుమారి, యూపీహెచ్సీ పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి.శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు కె.రాజేశ్వరి, పి.శ్రీలక్ష్మి, బి.తార, ఆశా కార్యకర్తలు బి.భవాని, టి.రాజమణి పాల్గొన్నారు.