– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
రుద్రంపూర్, ఫిబ్రవరి 2 : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న జరుగనున్న 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన స్థానాల్లో మైనారిటీ వర్గాల వారికి 10 శాతం చైర్మన్, చైర్ పర్సన్, మేయర్ పదవులను కేటాయించాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా అన్నారు. ఈ మేరకు ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు పెద్దపీట వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మైనారిటీలు రాజకీయంగా ఎదిగేందుకు తగు సహకారం అందించాలని కోరారు.