ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పీఆర్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు
అశ్వారావుపేట/ దమ్మపేట రూరల్/ దమ్మపేట, జూలై 8: పామాయిల్ సాగును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తునట్లు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు తెలిపారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టీఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్, ఎండీలు రామకృష్ణారెడ్డి, సురేందర్తో కలిసి గురువారం మండలంలోని మందలపల్లి, అల్లిపల్లి గ్రామాల్లో పామాయిల్ తోటలను పరిశీలించారు. సాగు, ఆదాయం తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పామాయిల్లో మరో అంతర్ పంటగా వక్క సాగుకు అవకాశం ఉందని, సత్ఫలితాలిస్తుందా? లేదా? అనే విషయంపై ఉద్యానవన శాస్త్రవేత్తలతో చర్చించి రైతులకు అవగాహన కల్పించాలని ఎండీ సురేంద్రకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అనంతరం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. గెలల నుంచి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి గురించి ఆయిల్ఫెడ్ జీఎం సుధాకర్రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, బాలకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు అల్లిపల్లి పల్లెప్రకృతి వనంలో మొక్కను, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ పామాయిల్ తోటలో జాజికాయ మొక్కను నాటారు. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, శీమకుర్తి వెంకటేశ్వరరావు, అంకిత ఉమామహేశ్వరరావు, డీహెచ్వో మరియన్న, ఏడీఏ అఫ్జల్ బేగం, ఏవో చంద్రశేఖర్రెడ్డి, హెచ్వో సందీప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దమ్మపేట మండలంలో వ్యవసాయ సాగు పద్ధతులతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పంటల నమోదు వివరాల గురించి రఘునందన్రావు ఏఈవోలను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధికే అధిక ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని పంచాయతీరాజ్ కమిషనర్, వ్యవసాయ శాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు స్పష్టం చేశారు. మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. వారు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. ముందుగా నారంవారిగూడెంలోని ఆయిల్ఫెడ్ నర్సరీని సందర్శించారు. మొక్కల ఉత్పత్తి, మార్కెటింగ్, విత్తనాల దిగుమతి వంటి అంశాలను చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ వివరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల పరిషత్ ప్రాంగణంలో హరితహారం మొక్కలు నాటారు. డీహెచ్వో జీనుగు మరియన్న, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, అశ్వారావుపేట, పేరాయిగూడెం సర్పంచ్లు అట్టం రమ్య, నార్లపాటి సుమతి, తహశిల్థార్ ప్రసాద్, ఎంపీడీవో విద్యాధర్రావు, టీఆర్ఎస్ నాయకులు బండి పుల్లారావు, బండారు శ్రీనివాసరావు, శీమకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.