అశ్వారావుపేట: ఆయిల్ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఉద్దేశ్యంతోనే సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ చెప్పారు. పంట కొనుగోలులోనూ దళారీ వ్యవస్థ ఉండదని, ఆయిల్ఫెడ్ నేరుగా రైతుల నుంచి పంటసేకరించటంతో పాటు రవాణా చార్జీలు జూడ చెల్లిస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 250 మంది రైతులు, 10 మంది ఉద్యానవన శాఖాధికారులు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆయిల్ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్పెడ్ క్షేత్ర సిబ్బంది ప్రవీణ్, యశస్వీ, సతీష్, కృష్ణారావు, ఫణీలు పాల్గొన్నారు.