సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది అమృత్ మహోత్సవ్లో భాగంగా న్యాయసేవా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో న్యాయసేవా సంస్థలు అందించే సేవలు, పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కక్షిదారులకు సూచించారు. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, అనదపు జూనియర్ సివిల్జడ్జి శ్రావణస్వాతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీతారామయ్య, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.